Saturday, 18 April 2020

Lock down time lo ఏం వండుకోవాలా అని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ list follow అయ్యిపోతే సరి...కుదిరితే అన్నీ ఒకోటీ వేయించుకుని చేసుకుని తినండి .. 🙏💐💐💐🙏

*తెలుగువాణ్ణి తిండిలో కొట్టగలరా ?*

మినపట్టు
పెసరట్టు 
రవ్వట్టు
పేపర్ దోసె
మసాల దోసె
ఉల్లి దోసె 
రాగి దోశ
చీజ్ పాలక దోశ
కొబ్బరి అట్టు
గోధుమ అట్టు
అటుకుల అట్టు
సగ్గుబియ్యం అట్టు
బియ్యపు పిండి అట్లు
పుల్లట్టు
ఊతప్పం
పులి బొంగరం
ఉప్మా అట్టు
ఇడ్లీ 
మసాల ఇడ్లీ
రవ్వ ఇడ్లీ
సాంబార్ ఇడ్లి
ఆవిరి కుడుము
మసాలా ఉప్మా
బొంబాయి రవ్వ ఉప్మా
గోధుమ రవ్వ ఉప్మా
సేమ్యా ఉప్మా
టమోటా బాత్
ఇడ్లీ ఉప్మా
బియ్యపు రవ్వ ఉప్మా
నూకలుప్మా
మరమరాల ఉప్మా
కొబ్బరి ఉప్మా
అటుకుల ఉప్మా
ఉప్పిడి పిండి
పూరి
చపాతి
వడ
సాంబారు వడ
పప్పు పొంగలి 
కంచి పులిహోర
నిమ్మ పులిహోర
కొబ్బరి అన్నం
పుదీనా పులావ్
బిర్యాని
దధ్యోదనం
చక్రపొంగలి
కట్టుపొంగలి
వెజ్ ఫ్రైడ్ రైస్
జీరా రైస్
పులగం
ఉల్లిపాయ చట్నీ
ఎండుమిరపకాయ చట్నీ
కొబ్బరి చట్నీ
మినప చట్నీ
వేరుశనగపప్పు చట్నీ
శనగపప్పు చట్నీ
శనగపిండి చట్నీ (బొంబాయిచట్నీ)
శనగపప్పు పొడి
ధనియాల పొడి
కొబ్బరి పొడి
నువ్వుల పొడి
వెల్లుల్లిపాయ కారప్పొడి
కరివేపాకు పొడి
కందిపొడి
మునగాకు చట్నీ 
గుమ్మడి చట్నీ 
అటుకుల పులిహార
చింతపండు పులిహార
నిమ్మకాయ పులిహార
మామిడికాయ పులిహార
రవ్వ పులిహార
సేమ్యా పులిహార
ఆలు పరోట
చపాతి
పరోట
పుల్కా
పూరి & సాగు
రుమాల్  రోటీ
కాలీఫ్లవర్ పరోటాలు
పాలక్ పన్నీర్
కొత్తరకం పూరీలు
ముద్దపప్పు
దోసకాయ పప్పు
బీరకాయ పప్పు
టమోటా పప్పు
మామిడి కాయ పప్పు
తోటకూర పప్పు
గుమ్మడి పప్పు 
చింత చిగురు పప్పు
కంది పచ్చడి
కొబ్బరి పచ్చడి
క్యాబేజి పచ్చడి
క్యారెట్ పచ్చడి
దొండకాయ పచ్చడి
దోసకాయ పచ్చడి 
బీరకాయ తొక్కు పచ్చడి
బెండకాయ పచ్చడి
మామిడికాయ పచ్చడి
వంకాయ పచ్చడి
వెలక్కాయ పచ్చడి
టమోటా పచ్చడి
మెంతికూర పచ్చడి
పొట్లకాయ పెరుగు పచ్చడి
బీరకాయ పచ్చడి
సాంబారు
సాంబారు పొడి
పులుసు (తీపి)
పొట్ల కాయ పులుసు
సొరకాయ పులుసు
మజ్జిగ పులుసు
పప్పు పులుసు
ఉల్లిపాయ పకోడి
క్యాబేజి పకోడి
గోధుమ పిండి పకోడి
పాలక్ - పకోడి (పాలకూర పకోడి)
బియ్యపు పిండి పకోడి
మసాల పకోడి
మెత్తటి పకోడి
బ్రెడ్ పకోడి
పల్లీ పకోడీలు 
సేమ్యా పకోడి
కాలీఫ్లవర్‌ పకోడి
ఆలూ పకోడి
ఖాండ్వీ
అటుకుల పోణీ
అప్పడం బజ్జి
అరిటికాయ బజ్జి
ఉల్లిపాయ బజ్జి
టమటా బజ్జి
బంగాళదుంప బజ్జి
బీరకాయ బజ్జి 
బ్రెడ్ బజ్జి
మిరపకాయ బజ్జి 
వంకాయ బజ్జి
క్యాప్సికమ్ బజ్జి
కొర్ర బజ్జీ
గుమ్మడికాయ బజ్జీలు
దోసకాయ బజ్జి
గుంట పునుగులు
పునుగులు
మైసూర్  బోండ
సాగో బోండాస్ (సగ్గుబియ్యం పునుగులు)
మసాల గారె
నేతి గారె
పప్పు వడ
మసాల వడ
వెజిటబుల్ వడ
పెసర గారెలు
మినపచెక్క వడలు
సగ్గుబియ్యం బోండా
బఠాణీ బోండా
పచ్చి బఠానీ బోండాలు
మామిడి అల్లం పచ్చడి(అల్లంపచ్చడి)
ఉసిరి ఆవకాయ
ఉసిరికాయ పచ్చడి
కాకరకాయ పచ్చడి
కొత్తిమీర పచ్చడి
గోంగూర పచ్చడి
చింతకాయ పచ్చడి
టమోటా పచ్చడి
దబ్బకాయ ఊరగాయ
పండు మిరపకాయల పచ్చడి
మామిడికాయ ఆవకాయ
మామిడికాయ తురుంపచ్చడి
మామిడికాయ (మాగాయ)
ముక్కల పచ్చడి
మునక్కాయ ఆవకాయ
పెసర ఆవకాయ
కాలీఫ్లవర్ పచ్చడి
చిలగడదుంపల పచ్చడి 
క్యాబేజీ ఊరగాయ
వంకాయ పచ్చడి
నిమ్మకాయ ఊరగాయ
వెల్లుల్లి పచ్చడి 
కాజాలు
బూంది 
చక్రాలు
కారప్పూస
చెగోడి
చెక్కలు
తపాళ చెక్కలు
పెసర చెక్కలు
చెక్క పకోడి
పెరుగు చక్రాలు
సగ్గుబియ్యం చక్రాలు
శనగపప్పు చక్రాలు
వాంపూస
గవ్వలు
ఆలూ చిప్స్
బనానా చిప్స్
మసాల బీన్స్ 
కారం చెక్కలు
అలూతో చక్రాలు 
కొబ్బరి చెక్కలు 
జొన్న మురుకులు
మైదా కారా (మైదాచిప్స్)
వెన్న ఉండలు
పన్నీర్ చట్ పట్
సోయా సమోస, సమోస
చిలకడ దుంప చిప్స్
కాకరకాయ చిప్స్
జంతికలు
గుమ్మడి వరుగు (చిప్స్)
అరిసెలు
బూరెలు
కొబ్బరి బూరెలు 
పచ్చి బూరెలు 
తైదు బూరెలు
మైదాపిండితో పాల బూరెలు 
సజ్జ బూరెలు
గోధుమ బూరెలు
చలిమిడి
కొబ్బరి పూర్ణాలు 
గోధుమ పిండితో పూర్ణాలు 
పూతరేకులు
జొన్న బూరెలు
బూంది లడ్డు
రవ్వ లడ్డు
తొక్కుడు లడ్డు
మినప ముద్దలు
సున్నుండలు
బాదుషా
మడత కాజా
తీపి కాజాలు
మైసుర్ పాకు
జాంగ్రి
పూస మిఠాయి
కోవా
కజ్జి కాయలు
తీపి గవ్వలు
జీడిపప్పు పాకం
శనగపప్పు పాకం
వేరుశనగపప్పు ముద్దలు
మరమరాల ముద్దలు
డ్రైఫ్రూట్స్ హల్వా
నువ్వుల లడ్డు (చిమ్మిరిముద్ద)
కోవా కజ్జికాయ
మిల్క్ మైసూర్‌ పాక్
కాజు క్యారెట్
బటర్ బర్ఫీ
కిస్‌మిస్ కలాకండ్
బూంది మిఠాయి
పాపిడి
చాంద్ బిస్కట్స్
ఖర్జూరం స్వీట్
సేమ్యాతో అరిసెలు
కొబ్బరి ఖర్జూరం
బాదంపాకము 
బాంబే హల్వ

Wednesday, 15 April 2020

*🔥గొప్ప సంఘ సంస్కర్త, తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి. కందుకూరి వీరేశలింగం జయంతి సందర్భంగా..🔥

*🔥గొప్ప సంఘ సంస్కర్త, తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి. కందుకూరి వీరేశలింగం జయంతి సందర్భంగా..🔥

■ సంఘ సంస్కరణకు, సామాజిక దురాచారాల నిర్మూలనకు నిరుపమానమైన కృషి చేసిన మహానుభావుడు ఆయన.సాహితీ వ్యాసంగం లోనూ అంతటి కృషి చేసిన కందుకూరి బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు.

*■ ఒక వ్యక్తిగా, సంఘసంస్కర్తగా, రచయితగా వీరేశలింగానికి అనేక విశిష్టతలు ఉన్నాయి. అనేక విషయాలలో ఆంధ్రులకు ఆయన ఆద్యుడు, ఆరాధ్యుడు. ఆధునికాంధ్ర సమాజ పితామహుడిగా కీర్తి గడించిన వ్యక్తి కందుకూరి.*

*☀జీవిత విశేషాలు..*

*

*■ వీరేశలింగం పంతులు 1848 ఏప్రిల్ 16న  రాజమండ్రిలో పున్నమ్మ, సుబ్బారాయుడు దంపతులకు జన్మించాడు. వీరి పూర్వీకులు ఇప్పటి ప్రకాశం జిల్లాలోని కందుకూరు గ్రామం నుండి రాజమండ్రికి వలస వెళ్ళడం వలన వారికి ఈ ఇంటి పేరు స్థిరపడిపోయింది.*

■వీరేశలింగానికి నాలుగేళ్ళవయసులో తండ్రి చనిపోయాడు. పెదతండ్రి, నాయనమ్మల పెంపకంలో అల్లారుముద్దుగా పెరిగాడు. ఐదో యేట బడిలో చేరి, బాలరామాయణం, ఆంధ్ర నామ సంగ్రహం, అమరం,రుక్మిణీ కళ్యాణం,  సుమతీ శతకం, కృష్ణ శతకం మొదలైనవి నేర్చుకున్నాడు. పన్నెండో యేట రాజమండ్రి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు చదువులో చేరాడు. చిన్నప్పటినుండి, అన్ని తరగతుల లోనూ, ప్రథమ శ్రేణిలోనే ఉండేవాడు. 

■ తన పదమూడో యేట బాపమ్మ (కందుకూరి రాజ్యలక్ష్మమ్మ) అనే ఎనిమిదేళ్ళ అమ్మాయితో బాల్యవివాహమయింది. పెరిగి పెద్దయ్యాక వీరేశలింగం ఇటువంటి దురాచారాల నిర్మూలనకే కృషి చేసాడు.

*■ చదువుకునే రోజుల్లో [ కేశుబ్ చంద్ర సేన్] రాసిన పుస్తకాలు చదివి ప్రభావితుడయ్యా డు. విగ్రహారాధన, పూజలు మొదలైన వాటి మీద నమ్మకం తగ్గడమే కాక, దయ్యాలు, భూతాలు లేవనే అభిప్రాయానికి వచ్చాడు. ప్రజలకు అది నిరూపించడానికి అర్ధరాత్రి శ్మశానానికి వెళ్ళేవాడు.*

*■1867లో పెదనాన్న మరణంతో ప్రభుత్వో ద్యోగంలో చేరాలని ప్రయత్నించాడు, కాని లంచం ఇవ్వనిదే రాదని తెలిసి, ప్రభుత్వోద్యో గం చెయ్యకూడ దని నిశ్చయించుకున్నాడు. న్యాయవాద పరీక్ష వ్రాసి,  న్యాయవాద వృత్తి చేపడదామ ని భావించినా, అందులోనూ అవినీతి ప్రబలంగా ఉందనీ, అబద్ధాలు ఆడటం వంటివి తప్పనిసరి అని గ్రహించి, అదీ మానుకున్నాడు. ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించాడు.*

*■ ఉపాధ్యాయుడిగా పిల్లలకు పాఠాలతో పాటు, సంఘ సంస్కరణ భావాలను బోధించాడు. సమాజంలోని దురాచారాలపై తన భావాలను వ్యాప్తి చెయ్యడానికి 1874  అక్టోబరులో " వివేకవర్ధని" అనే పత్రికను ప్రారంభించాడు. “సంఘం లోని అవకతవక లను ఎత్తి చూపడం,దురాచారాల నిర్మూలన, ప్రభుత్వ వ్యవస్థలో ప్రబలంగా ఉన్న అవినీతి ని ఎత్తి చూపి, అవినీతిపరులను సంఘం ముందు పెట్టడం” వివేకవర్ధని లక్ష్యాలని ఆయన మొదటి సంచికలో తెలియజేసాడు. చెప్పడమే కాదు, అలాగే నడిపాడు కూడా. వివేకవర్ధని అవినీతిపరుల పాలిట సింహస్వప్నమయింది.*

■ కందుకూరికి సమకాలిక ప్రముఖుడైన  కొక్కొండ వెంకటరత్నం పంతులుతో స్పర్ధ ఉండేది. కందుకూరి వివేకవర్ధని స్థాపించిన తరువాత కొక్కొండ హాస్య వర్ధని అనే పత్రికను ప్రారంభించాడు. ఆ పత్రికకు పోటీగా కందుకూరి హాస్య సంజీవిని అనే హాస్య పత్రికను ప్రారంభించాడు. తెలుగులో మొదటి ప్రహసనం కందుకూరి ఈ పత్రికలోనే ప్రచురించాడు. ఎన్నో ప్రహసనాలు, వ్యంగ్య రూపకాలు ఈ పత్రికలో ప్రచురించాడు.

*■ ఆంధ్రదేశంలో బ్రహ్మసమాజం స్థాపించాడు.  యువజన సంఘాల స్థాపన కూడా వీరేశ లింగం తోనే మొదలయింది. సమాజ సేవ కొరకు హితకారిణి (హితకారిణీ సమాజం 1905 లో) అనే ధర్మ సంస్థను స్థాపించి, తన యావదాస్తిని దానికి ఇచ్చేసాడు. 25 సం"ల పాటు రాజమండ్రిలో తెలుగు పండితుడిగా పనిచేసి, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండితుడిగా ఐదేళ్ళు పనిచేసాడు. తాను నమ్మిన సత్యాన్ని, సిద్దాంతాన్ని తు.చ. తప్పకుండా పాటించిన వ్యక్తి ఆయన.*

*🌟సంఘ సంస్కరణ కార్యక్రమాలు..*

**■ సంఘసంస్కరణ కై ప్రవచనాలు మాత్రం చెప్పి ఊరుకోలేదు, స్వయంగా అందుకై నడుం కట్టి కార్యరంగంలోకి దూకాడు.*

*■ వివేకవర్ధని పత్రిక ద్వారా అవినీతిపరులపై యుద్ధం సాగించి వారిని హడలెత్తించాడు.* 

■ ఆ రోజుల్లో స్త్రీలకు విద్య అవసరం లేదని భావించేవారు. వీరేశలింగం స్త్రీవిద్యకై ఉద్యమించి, ప్రచారం చెయ్యడమే కాక, బాలికల కొరకు పాఠశాలను ప్రారంభించాడు. తానే స్వయంగా చదువు చెప్పేవాడు. మగపిల్లలతో ఆడపిల్లలు కలిసి చదువుకునే సహ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాడు కూడా. అంటరాని కులాలకు చెందిన పిల్లలను కూడా చేర్చుకుని మిగతా పిల్లలతో కలిపి కూర్చో బెట్టేవాడు.వారికి ఉచితంగా చదువుచెప్పడం తో బాటు,  పుస్తకాలు, పలకా బలపాలు కొనిచ్చేవాడు.

*■ బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, కుల నిర్మూలనకు ఆయన అకుంఠిత దీక్షతో పనిచేసాడు.*

*■ స్త్రీల కొరకు సతీహిత బోధిని అనే
 పత్రికను కూడా నడిపాడు.*

*■ వేశ్యా వ్యవస్థ పాతుకుపోయిన ఆ రోజుల్లో దానికి వ్యతిరేకంగా వివేకవర్ధనిలో వ్యాసాలు రాసాడు.*

■ ఆయన చేసిన ఇతర సంస్కరణ కార్యక్రమా లొక ఎత్తు, వితంతు పునర్వివాహాలొక ఎత్తు. అప్పటి సమాజంలో బాల్యంలోనే ఆడపిల్లల కు పెళ్ళిళ్ళు చేసేవారు. కాపురాలకు పోక ముందే భర్తలు చనిపోయి, వితంతువులై, అనేక కష్టనష్టాలు ఎదుర్కొనే వారు. దీనిని రూపుమాపేందుకు వితంతు పునర్వివాహాలు జరిపించాలని ప్రచారం చేసాడు. 

■ 1881 డిసెంబరు 11న తమ ఇంట్లో మొట్టమొదటి వితంతు వివాహం చేశాడు. తొమ్మిదేళ్ళ బాల వితంతువు గౌరమ్మ  తిరువూరు తాలూకా రేపూడికి చెందిన పిల్ల. వరుడు గోగులపాటి శ్రీరాములు . ఈ పెళ్ళి పెద్ద ఆందోళనకు దారి తీసింది. పెళ్ళికి వెళ్ళినవాళ్ళందరినీ సమాజం నుండి వెలి వేశారు. సమాజం నుండి ఎంతో ప్రతిఘటన ఎదురైనా పట్టుబట్టి సుమారు 40 వితంతు వివాహాలు జరిపించాడు.

*☄విప్లవాత్మకమైన మార్పు..*

◆ చిన్ననాటి నుండి అతనికి అలవడిన స్వాభావిక లక్షణములే కార్యదీక్ష, సాహసము, విజ్ఞాన తృష్ణలు.

◆ రామమోహనరాయ్, దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవ చంద్రసేన్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ ల బోధనలు, రచనలు ఇతని ఆధ్యాత్మిక చింతనలో విప్లవాత్మకమైన మార్పును తెచ్చాడు. 1887 సంవత్సరంలో సంఘ సంస్కరణ సమాజము స్థాపించి, మతమనే ముసుగులో అధోగతిలో ఉన్న హైందవ సమాజములోని దురాచారములపై విప్లవం ప్రారంభించాడు. ఆయన మూఢ విశ్వాస ములు, సనాతనాచారములపై జరిపిన పోరాటము చిరస్మరణీయమైనది.

*📜🖋సాహితీ వ్యాసంగం:*

■సంఘసేవలో వీరేశలింగం ఎంతకృషి చేసాడో, సాహిత్యంలోనూ అంతే కృషి జరిపాడు. చదువుకునే రోజుల్లోనే రెండు శతకాలు రాసాడు. పత్రికలకు వ్యాసాలు రాస్తూ ఉండేవాడు. వివేకవర్ధనిలో సులభ శైలిలో రచనలు చేసేవాడు. వ్యావహారిక భాషలో రచనలు చేసిన ప్రథమ రచయితల లో ఆయన ఒకడు. తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు భాషల్లో అద్వితీయ ప్రతిభ కలవాడు కందుకూరి.

◆ ఆయన 130 కి పైగా గ్రంథాలు వ్రాసాడు. ఆన్ని గ్రంథాలు వ్రాసిన వారు తెలుగులో అరుదు. రాజశేఖర చరిత్ర అనే నవల,  సత్యరాజా పూర్వ దేశయాత్రలు ఆయన రచనలలో ప్రముఖమైనవి. 

◆ అనేక ఇంగ్లీషు, సంస్కృత గ్రంథాలను తెలుగులోకి అనువదించాడు. బడి పిల్లల కొరకు వాచకాలు వ్రాసాడు. స్వీయ చరిత్ర వ్రాసాడు. ఆంధ్ర కవుల చరిత్రను కూడా ప్రచురించాడు.

◆ సంగ్రహ వ్యాకరణం వ్రాసాడు. నీతిచంద్రిక (తెలుగు పంచతంత్రం) లోని సంధి, విగ్రహం భాగాలను చిన్నయసూరి వదిలివేయగా వీరేశలింగం పూర్తి చేసాడు.

*🌟కందుకూరి రచనల జాబితా:*

*

*☀నాటకాలు..*
*◆ చమత్కార రత్నావళి:* "కామెడీ ఆఫ్ ఎర్రర్స్" అనే షేక్స్‌పియర్ నాటకాన్ని తెలుగులో వ్రాసి విద్యార్థులచే ప్రదర్శింపజేశాడు.కాళిదాసు శాకుంతలం-తెలుగులో రత్నావళి - సంస్కృత రూపకానువాదందక్షిణ గోగ్రహణంసత్య హరిశ్చంద్రమాళవికాగ్ని మిత్రము వంటి 12 నాటకాలు

*☀నవలలు..*
*◆ రాజశేఖర చరిత్రము:* తొలి తెలుగు సాంఘిక నవల. ఆంగ్లంలో ఆలివర్ గోల్డ్‌స్మిత్ వ్రాసిన "వికార్ ఆఫ్ వేక్‌ఫీల్డ్" అనే నవలకూ దీనికీ కొన్ని పోలికలున్నాయి. అయితే ఆ నవల కొంత ఉపకరించిందనీ, కాని ఇది అనువాదం కాని అనుకరణ కాని కాదని వీరేశలింగం చెప్పాడు. 

*◆ సత్యరాజా పూర్వదేశ యాత్రలు:* ఆంగ్లంలో "జోనాథన్ స్విఫ్ట్" వ్రాసిన "గల్లివర్స్ ట్రావెల్స్" ఆధారంగా వ్రాశాడు. ఇందు సమాజపు వికృత సంఘటనలను అవహేళన చేశాడు. "ఆడ మళయాళం" అనే పదం ఇందులోంచే ప్రసిద్ధమయ్యింది.

*◆ సత్యవతీ చరిత్రము(1883):*  స్త్రీ విద్యాభివృద్ధిని, ప్రాముఖ్యతను బోధించే నవల - ఆ రోజులలో ఇది మంచి ప్రాచుర్యాన్ని పొందింది.

*◆ చంద్రమతీ చరిత్రము (1884):* మత విషయాలను, ధర్మాలను, స్త్రీ అభ్యుదయాన్ని ప్రోత్సహించే నవల.

*☀ప్రహసనాలు..*
◆సాంఘిక దురాచారాలను సంభాషణాత్మ
కంగా,వినోదాత్మకంగా విమర్శించే ఇటువంటి ప్రయోగానికి వీరేశలింగమే ఆద్యుడు. చాలా ప్రహసనాలను "వివేక వర్ధిని" పత్రికలో ప్రచురించాడు. 

*☀కథలు..*
◆ అధికంగా కందుకూరి కథలు స్త్రీల అభ్యుదయాన్ని ప్రోత్సహించేవిగా ఉన్నాయి. కొన్ని ఆంగ్ల మూలాలనుండి అనుసరించినవి కాని అధికంగా స్వతంత్ర రచనలే. "సతీ హిత బోధిని" అనే పత్రికలో ఎక్కువగా ప్రచురించా డు. "నీతి కథా మంజరి" అనే 158 చిన్న కథల సంకలనాన్ని కూడా వెలువరించాడు.

*☀వీరేశలింగం నడిపిన పత్రికలు..*
◆ వివేక వర్ధిని,సతీహిత బోధిని,సత్య సంవర్ధిని,సత్యదూత,చింతామణి,తెలుగు జనానా.

*🌟ఆయనకున్న ఇతర విశిష్టతలు:*

★మొట్టమొదటి వితంతు వివాహం జరిపించిన వ్యక్తి
★మొట్టమొదటి సహవిద్యా పాఠశాలను ప్రారంభించాడు
★తెలుగులో మొదటి స్వీయ చరిత్ర ఆయనదే
★తెలుగులో తొలి నవల వ్రాసింది ఆయనే
★తెలుగులో తొలి ప్రహసనం వ్రాసింది కందుకూరి.

*■ యుగకర్త గా ప్రసిద్ధి పొందిన ఆయనకు  "గద్య తిక్కన "అనే బిరుదు ఉంది. ఆంధ్ర సమాజాన్ని సంస్కరణల బాట పట్టించిన సంస్కర్త, వీరేశలింగం 1919 మే 27 న మరణించాడు.*

*☀వీరేశలింగంకు నివాళులు..*
◆ఆరుద్ర ఇలా అన్నాడు (సమగ్ర ఆంధ్ర సాహిత్యం)

*" అదేం చిత్రమో గాని తాము శారీరకంగా దుర్బలులైనా జాతిని బలిష్ఠం చేసి దేశాభివృద్ధిని, భాషాభివృద్ధిని సాధించిన మనోబల భీములలో పంతులుగారు ప్రధములు. రెండోవారు గురజాడవారు. అటువంటి ఉజ్వల చారిత్రకుని ఏ బిరుదుతో వర్ణించినా అది అసమగ్రమే. అయినా నవ్యాంధ్ర నిర్మాతలనే నిర్మించినవారిగా నేను పంతులుగారిని భావిస్తున్నాను. అభినవాంధ్రకు ఆయన ఆద్య బ్రహ్మ"*

◆చిలకమర్తి లక్ష్మీనరసింహం వీరేశలింగం గురించి ఇలా అన్నాడు: ఇది వీరేశలింగం సమాధి పైఈ నాటికీ కనిపిస్తుంది.

*“తన దేహము తన గేహముతన కాలము తన ధనంబు తన విద్య జగజ్జనులకే వినియోగించినఘనుడీ వీరేశలింగకవి జనులార!”*

*జ:ఏప్రిల్16,1848 -మ:మే 27,191*

*💥మన లైఫ్ ఇప్పటిదాకా ఒక లెక్క.... ఇప్పటినుండి ఒక లెక్క....*.

*💥మన లైఫ్ ఇప్పటిదాకా ఒక లెక్క.... ఇప్పటినుండి ఒక లెక్క....*.                         

కరోనా పూర్తిగా కనుమరుగైన తర్వాత కూడా ఇలాంటి వైరస్​లు మరిన్ని పుట్టుకురావొచ్చు. అందుకే ఇప్పటిదాకా గడిపిన జీవితం వేరు.. ఇక నుంచి గడపాల్సిన జీవితం వేరు. పర్సనల్​గానే కాదు ఫ్యామిలీ మెంబర్స్​తో గడిపే లైఫ్​ కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్​, రిలేటివ్స్​, కొలీగ్స్​తో రిలేషన్​ కూడా చేంజ్​ చేసుకోవాలి.  వీటన్నింటితో పాటు.. మన అలవాట్లు కూడా మార్చుకోవాలి.

🏠🏕️ *ఇంటి నుంచే మొదలవ్వాలి*🏡🏝️🏕️

లైఫ్​స్టైల్​ చేంజ్​ అనేది ముందుగా ఇంటి నుంచే మొదలవ్వాలి. బయటి పరిస్థితులు ఎలా ఉన్నా… ఇంట్లో ఉండాల్సి వస్తే, ఆ ఇల్లు ఆరోగ్యాన్నిచ్చేదిలా ఉండాలి. అంటే.. అవసరమైనప్పుడే ఇంట్లోకి గాలి, వెలుతురు వచ్చేలా మార్పులు చేసుకోవాలి. ఎప్పుడూ మెడికల్​ షాపు​లోని మందులపైనే ఆధారపడకుండా ఆయుర్వేదంలో ఉపయోగించే ఔషధ మొక్కలను ఇంట్లో పెంచాలి. ఇల్లు ఎప్పుడూ పొడిగా ఉండాలి. వాటర్ లీకేజీ లేకుండా రిపేర్​ చేయించుకోవాలి. అలాగే స్థలం ఉంటే బాత్రూమ్​, వాష్​రూమ్​ వంటివి ఆరుబయట ఏర్పాటుచేసుకోవాలి. బ్రష్​ చేసుకునే సింక్​ వంటివి కూడా ఇంట్లో కాకుండా బయటే ఉంటే బెటర్​. ఇంట్లోని ఫ్లోర్​ను ఈజీగా క్లీన్​ చేసుకునేలా స్పేస్​ ఫ్రీగా ఉంచుకోవాలి. అవసరంలేని వస్తువులన్నింటిని అటకెక్కించాలి.

🗒️ *కిరాణా లిస్ట్​ మారాలి🗒️

ఇప్పటిదాకా కిరాణా లిస్ట్​ కేవలం వంటింటి సరుకులు, సబ్బులు, సర్ఫ్​లకే పరిమితమయ్యేది. ఇకపై ఆ లిస్ట్​లో హ్యాండ్​వాష్, శానిటైజర్​ వంటివి కూడా చేర్చాలి. ఇప్పుడు కరోనా కలకలం ఉంది కదా అని మాత్రమే చేతులు కడుక్కుంటే సరిపోదు. ఇకపై కూడా చేతులు శుభ్రంగా ఉంచుకోవడం అలవాటుగా మార్చుకోవాలి.
అందుకే ఇంట్లో ఎప్పుడూ హ్యాండ్​వాష్​, బ్యాగ్​లో ఎప్పుడూ శానిటైజర్​ ఉంచుకోవాలి.

🍉🍊🍅🍋🥥🍌🥬🥒🌶️🍆🌽🧅🥦🥕🥭🍑🍈🍒 *ఫుడ్​ హ్యాబిట్స్ మారాలి*

కాలంతో సంబంధం లేకుండా వేడి వేడివి  మాత్రమే తినాలి. ఫ్రిజ్​లో పెట్టి తినే అలవాటు మార్చుకోవాలి. కేవలం రుచికోసమే కాకుండా ఆరోగ్యం గురించి కూడా ఆలోచించి అన్నిరకాల ఆహారపదార్థాలు తినడం అలవాటు చేసుకోవాలి. జంక్​ ఫుడ్​, కూల్​ డ్రింక్స్​ వంటివాటికి వీలైనంత దూరంగా ఉండాలి.  తాజా కూరగాయలు, పండ్లు, మొలకెత్తిన గింజలు, డ్రైఫ్రూట్స్​ వంటివి రెగ్యులర్​గా తినాలి. నిజానికి జంక్​ఫుడ్​తో పోలిస్తే వీటికి అయ్యే ఖర్చు చాలా తక్కువే. ఫ్రిజ్​లో నీళ్లు తాగడం మానేసి వేడి నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. అంతగా చల్లటి నీళ్లు తాగాలనుకుంటే కుండలో నీళ్లు తాగాలి.

 🧘‍♂️🧘‍♀️ *వర్కవుట్స్​ కంపల్సరీ* 

శరీరానికి తగినంత ఇమ్యూనిటీ​ ఉంటే వైరస్​లు, బ్యాక్టీరియాల వల్ల వచ్చే వ్యాధులన్నింటినీ దాదాపు తరిమికొట్టొచ్చు. అదే లేకపోతే మనం ఎన్నిజాగ్రత్తలు తీసుకున్నా లాభం ఉండదు. మరి ఈ ఇమ్యూనిటీ కోసం మంచి ఫుడ్​ మాత్రమే తీసుకుంటే సరిపోదు. శరీరంలోని ప్రతి వ్యవస్థ బలంగా మారేలా వర్కవుట్స్​ కూడా చేయాలి. ఇప్పటిదాకా అలవాటు లేకపోయినాసరే.. ఇక నుంచి వర్కవుట్స్​ హాబీగా మారాలి. యోగ, ధ్యానం, ప్రాణాయామం వంటివి కూడా ప్రాక్టీస్​ చేయాలి. వీటిని ఏదో ఒక మతానికి సంబంధించినవిగా చూడొద్దు.

 🛀 🚿 *పర్సనల్​  హైజీన్​* 🚿🚰

వ్యక్తిగత పరిశుభ్రత అనేది ఎప్పుడూ అవసరమే. బిజీ షెడ్యూల్​ ఉందని స్నానం చెయ్యకుండా ఉండొద్దు. తరచూ కాళ్లు, చేతులు కడుక్కోవడం అనేది ఎప్పుడూ కంటిన్యూ చేయాలి. ఇంట్లోకి అడుగుపెట్టకముందే కాళ్లు, చేతులు, ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. అంతేగానీ.. అలసిపోయి వచ్చామంటూ సోఫాలో అలాగే సాగిలపడొద్దు. వీలైతే ఆఫీస్​ నుంచి వచ్చాక కూడా వేడివేడి నీళ్లతో స్నానం చేయాలి. అంతేకాకుండా తరచూ చేతులతో ముఖాన్ని, శరీర భాగాలను తాకే అలవాటు కూడా మార్చుకోవాలి.

🧹🚽🪒🧽 *శుభ్రత* 

ఇంటిని, పరిసరాలను మాత్రమే శుభ్రం  చేసుకుంటే సరిపోదు. వైరస్​లు, బ్యాక్టీరియాలబారిన పడకుండా ఉండాలంటే ఇంటితోపాటు ఇంట్లో ఉండే వస్తువులను, పర్సనల్​గా మనం వాడే వస్తువులను కూడా క్లీన్​ చేసుకోవాలి. ల్యాప్​టాప్​, ఫోన్​, వ్యాలెట్, హ్యాండ్​ బ్యాగ్​, కంప్యూటర్​, కీబోర్డ్, టీవీ రిమోట్​, రిస్ట్​ వాచ్​, బుక్స్​ వంటివి క్లీన్​ చేయడం గురించి ఆలోచించం. కానీ వీటిని ఎప్పటికప్పుడు క్లీన్​ చేసుకోవాలి. ఎందుకంటే నిజానికి వీటివల్లే  వైరస్​ స్ప్రెడ్​ అవుతుంది.

 👨‍👨‍👦 *పిల్లలు, పెద్దల పట్ల..*

పిల్లలు, పెద్దల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా అస్సలు ఉండొద్దు. ‘జ్వరమేకదా.. జలుబే కదా.. దగ్గు కామనే’.. అంటూ నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఎప్పుడూ ఇలాగే వస్తుంది కదా, అదే తగ్గిపోతుందిలే అనే వైఖరి ఇకపై మారాలి.  అలాగని మెడికల్​ షాపు​ నుంచి ఏదిపడితే అది తెచ్చి వేయొద్దు. పిల్లలను శుభ్రంగా ఉంచడంతోపాటు వాళ్లకు బలమైనవి తినిపించాలి. ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చిన వెంటనే డాక్టర్​ను కలవాలి. ఎక్కువయ్యేదాకా ఆగడం మంచిదికాదు. పెద్దోళ్ల విషయంలో కూడా ఇలాగే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పిల్లలు, వృద్ధుల్లో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందనే విషయాన్ని గుర్తించాలి.

 🚷 *అవుట్​డోర్​ మీటింగ్స్​..* ,

టైంపాస్​ కాకపోతే అలా బయటకి వెళ్లొస్తామంటూ వెళ్లిపోతారు. సెలవు దొరికితే షికార్లకు ప్లాన్​చేస్తారు. కొన్నిసార్లు నేరుగా కలవాల్సిన​ అవసరం లేకపోయినా వెళ్లి కలిసి వస్తారు. బ్యాంకులు, బిల్లుల చెల్లింపు వంటివాటి కోసం గంటల తరబడి లైన్లలో నిలబడతారు. నిజానికి ఇవన్నీ ఇంటి నుంచే చేసుకోవచ్చు. అందుకే ఇకపై అవుట్​డోర్​ మీటింగ్స్​ను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. వీలైనంత వరకు ఫోన్​, ఆన్​లైన్​ చాటింగ్​ ద్వారానే పూర్తయ్యేలా చేసుకోవాలి. తప్పనిసరి అయితే తప్ప బయటికి వెళ్లొద్దు.

 *సెల్ఫ్​ డిసిప్లిన్​..* 

సెల్ఫ్​ డిసిప్లిన్​ తప్పనిసరి. అది ఇంట్లో ఉన్నా సరే.. బయటకెళ్లినా సరే. ఎక్కడైనా ‘క్యూ’లో నిలబడాల్సి వస్తే మనిషికి, మనిషికి మధ్య స్పేస్​ ఉండేలా నిలబడాలి. విదేశాల్లో ఈ కల్చర్​ ఉన్నా.. మనదేశంలో మాత్రం మీదపడి తోసుకోవడమే. అంతేకాదు.. తుమ్మినా, దగ్గినా దస్తీ​ అడ్డంగా పెట్టుకోవాలి. మాట్లాడేటప్పుడు కూడా దూరంగా ఉండి మాట్లాడాలి. తుంపర్లు పడేలా మరీ దగ్గరగా ఉండొద్దు.వ్యక్తీగత శుభ్రత పాటిస్తూ... ఆరోగ్యంగా... ఆనందంగా ఉంటూ... సంతోషంగా మెలుగుతూ... అందరికీ ఆదర్శంగా ఉండాలి.
నమస్తే..... 🙏
~~~~~~~~~~~~~~