కరోనా త్యాగభూమిలో నీ ఆటలు సాగవు
తిరగళి పిండితో వ్యాధులను మాన్పిన సాధువులెవరో!
విభూతిమహిమతో వ్యధలను తీర్చిన యోగులెవరో!
కనుచూపుతో ప్రకృతిని శాసించిన పతీవ్రతలెవరో!
దేశ రక్షణకై సర్వస్వాన్ని అర్పించిన త్యాగులెవరో!
ధర్మరక్షణకై తమ తపోబలాన్ని ధారవోసిన తాపసులెవరో!
యమధర్మరాజును గడగడలాడించిన శీలవతులెవరో!
వారందరి ప్రతిరూపాలే
కరోనా మహమ్మారినుండి మనలను కాపాడడం కొరకు
తమ ప్రాణాలను ఫణంగాపెట్టి
అహరహరము సేవలందిస్తున్న
మన వైధ్యులు,పోలీసులు,నాయకులు,మీడియా మిత్రులు
ఈ యజ్ఞంలో పాలుపంచుకుంటున్న ఇతరులు
వారి శ్రమను అర్థంచేసుకుందాం-వారిని కాపాడుకుందాం
వారి సూచనలు పాటిద్దాం-కరోనాను ఖతం చేద్దాం
వారి ఋణం తీర్చుకోవడమంటే- వారిసూచనలను పాటించడమే
వారందరికీ పాదాభివందనాలర్పిస్తూ.............
శ్రీరాం సత్యనారాయణ
ఆ.క.సం.సభ్యులు
ఆసీఫాబాదు
No comments:
Post a Comment